బిస్మిల్లా హిర్రహ్మ నిర్రహీమ్
ఇదం జనా ఉపశ్రుత నరాశం సస్తవిష్యతే
షష్టిం సహస్రానవతిం చ కౌరమ్ ఆ
రుశమేషు దబ్మ హే
ఉష్ట్ర్రా యస్య ప్రవాహీణో వధూమన్తో ద్విర్ధశ
వర్షమా రధస్యని జిహీడతే దివ
ఈషమాణా ఉప స్ప్రృశః
ఏష ఇషాయ మా మహే శతం నిష్కాన్ దశ స్రజః
త్రీణి శతాన్య ర్వతాం సహస్రా దశ గోనమ్
(ఆధర్వణ్ వేదం -౨౦ వ కాండం ,౧౨౭వ సూక్త, ౧-౩ వ మంత్రం)
’ఓ భక్తులారా ! ఈ ప్రభొధకుని మాటలు వినండి.......
ప్రశంసనీయుడూ ,ప్రశంసింపబడినవాడూ అయిన ఆ మహార్షి ౬౦౦౯౦ మంది మనుషుల మధ్య జననమొందుతాడు".
(మహమ్మద్ అంటేనే ప్రశంసనీయులు,ప్రశంసింప తగిన లక్షణములు గల వ్యక్తి, ఆయన జన్మించేనాటికి మక్కా నగర జనాభా సంఖ్య ౬౦ వేలు).
'ఆయన ఇరవై ఆడ ,మగ ఒంటేల మీద సవారీ చేస్తారు. అమోఘమయిన వారి కీర్తి స్వర్గలోకం దాకా పాకుతుంది.ఈ మహర్షి ౧౦౦ బంగారు నాణెములు కలిగి ఉంటారు’.
(ఒంటెల మీద పయనించె మహర్షులు మన భరతఖండంలొ కనిపించరు.అందుచేత ఆది మహమ్మద్ ప్రవక్తను ఉద్దేశించి రాసిన మాటలై వుంటాయి.౧౦౦ బంగారు నానేములు -అరేబియా వదలి అబిసినియాకు వలస వేళ్ళిన ౧౦౦ మంది శిష్యులని అర్ధం.)
మహప్రవక్తను విశ్వ కారుణ్య స్వరుపుడుగా "పవిత్ర దివ్య ఖురాన్ "నిర్వచిస్తున్నది.
Saturday, December 6, 2008
Subscribe to:
Posts (Atom)